Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజా ఆటోగ్రాఫ్‌తో రోడ్డు పైకి కియా తొలి కారు... త్వరలో షోరూమ్‌లకు...

రోజా ఆటోగ్రాఫ్‌తో రోడ్డు పైకి కియా తొలి కారు... త్వరలో షోరూమ్‌లకు...
, గురువారం, 8 ఆగస్టు 2019 (22:09 IST)
కియా మోటార్స్ అనంతపురం జిల్లా పెనుకొండలో నెలకొల్పిన ప్లాంట్ నుంచి తొలి కారు గురువారం రోడ్డెక్కింది. నారింజ, తెలుపు రంగులతో మిళితమైన ఈ సెల్టోస్ కారును ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకర నారాయణ, హిందూపురం లోక్ సభ సభ్యుడు గోరంట్ల మాధవ్, విప్ కాపు రామచంద్రా రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా చేతులు మీదుగా ఆవిష్కరించారు. ఈ తొలి కారుపై రోజా తన తొలి సంతకం చేశారు.
webdunia
 
ఈ కియా సెల్టోస్ కారు దేశంలోని అన్ని షోరూమ్‌లకు వస్తాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. కాగా ఈ తొలికారును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతులు మీదుగా ఆవిష్కరించాలని కియా ప్రతినిధులు ఆహ్వానించారు. కానీ వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేస్తున్న కారణంగా ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దానితో మంత్రుల చేతులు మీదుగా ఈ కారును లాంఛ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడలో డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు