Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో బలపడుతున్న నైరుతి రుతుపవనాలు

Webdunia
గురువారం, 26 మే 2022 (17:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయి. వీటి కారణంగా వచ్చే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి బలమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా, వీటి ప్రభావం కారణంగా ఏపీతో పాటు తమిళనాడు, లక్ష్యదీప్, తెలంగాణా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్నిప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమారిన ప్రాంతంతో పాటు దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
వచ్చే 48 గంటల్లో దక్షి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు మొత్తం మాల్దీవులు, లక్ష్యదీప్‌లోని పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలపై ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడివున్నాయి. 
 
దీంతో నైరుతు రుతపవనాలు బలపడి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, లక్ష్యదీప్, తెలంగాణా రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments