వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది, ఇక అరాచకాలు సాగవు...

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (11:52 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంద‌ని, ఇక అరాచకాలు సాగవ‌ని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ రెండున్నరేళ్ల పాలనంతా ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు అరాచకాలే తప్ప అభివృద్ది శూన్యం అని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మహిళల్ని బూతులు తిడుతుంటే, వైసీపీ  కార్యకర్తలు గ్రామాల్లో మహిళలపై దాడులకు పాల్పడుతున్నార‌ని ఆరోపించారు.

 
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు  నియోజకవర్గం తుమ్మలపాలెంలో టీడీపీ  మహిళా సర్పంచి మల్లేశ్వరి ఇంటిపై వైసీపీ రౌడీమూకల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని  అచ్చెన్నాయుడు అన్నారు. మహిళా హోం మంత్రి నియోజకవర్గంలో మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయంటే,  రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
 
 
అధికారం ఉందని మహిళల పట్ల బరితెగించి వ్యవహరిస్తున్నవారికి ముందు రోజుల్లో మహిళల చేతిలో బడితె పూజ ఖాయం అని చెప్పారు. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది, ఇక వారి అరాచకాలు సాగవు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది  టీడీపీ ప్రభుత్వమేనని వైసీపీ గుర్తుంచుకోవాల‌న్నారు. మళ్లీశ్వరి ఇంటిపై దాడికి పాల్పడ్డవారిని, దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాల‌ని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments