Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది, ఇక అరాచకాలు సాగవు...

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (11:52 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంద‌ని, ఇక అరాచకాలు సాగవ‌ని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ రెండున్నరేళ్ల పాలనంతా ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు అరాచకాలే తప్ప అభివృద్ది శూన్యం అని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మహిళల్ని బూతులు తిడుతుంటే, వైసీపీ  కార్యకర్తలు గ్రామాల్లో మహిళలపై దాడులకు పాల్పడుతున్నార‌ని ఆరోపించారు.

 
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు  నియోజకవర్గం తుమ్మలపాలెంలో టీడీపీ  మహిళా సర్పంచి మల్లేశ్వరి ఇంటిపై వైసీపీ రౌడీమూకల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని  అచ్చెన్నాయుడు అన్నారు. మహిళా హోం మంత్రి నియోజకవర్గంలో మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయంటే,  రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటి? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
 
 
అధికారం ఉందని మహిళల పట్ల బరితెగించి వ్యవహరిస్తున్నవారికి ముందు రోజుల్లో మహిళల చేతిలో బడితె పూజ ఖాయం అని చెప్పారు. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైంది, ఇక వారి అరాచకాలు సాగవు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది  టీడీపీ ప్రభుత్వమేనని వైసీపీ గుర్తుంచుకోవాల‌న్నారు. మళ్లీశ్వరి ఇంటిపై దాడికి పాల్పడ్డవారిని, దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాల‌ని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments