Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేలు కుట్టడంతో రక్తపు వాంతులు.. విద్యార్థి మృతి

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2023 (12:23 IST)
ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమలో ఓ విషాదకర ఘటన జరిగింది. తేలు కుట్టడంతో రక్తపు వాంతులు చేసుకున్న విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. తరగతి గదిలో పడివున్న చాక్లెట్ రేపర్లను బయటపడేస్తుండగా విద్యార్థిని తేలుకుట్టింది. ఆ తేలు విషం ఊపిరితిత్తుల్లోకి చేరడంతో రక్తపు వాంతులు చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లికి చెందిన వై.ప్రసాద్, శ్రీదేవిల కుమారుడు అభిలాష్ (14) అనే బాలుడు వాకతిప్ప జడ్పీహెచ్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. వలస కూలీ అయిన ప్రసాద్ వరంగల్‌లో పని చేస్తుండగా, శ్రీదేవి మాత్రం కువైట్‌లో పనిచేస్తుంది. అభిలాష్ మాత్రం తన తాతయ్య వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. 
 
ఈ పరిస్థితుల్లో గురువారం అతడు తన స్నేహితులతో కలిసి క్లాస్ రూంలో పడివున్న చాక్లెట్ రేపర్లను ఏరి, బయటపడేతుండగా ఆ రేపర్ల కింద దాగివున్న తేలు కుట్టింది. ఆ వెంటనే అభిలాష్‌ను ఉపాధ్యాయులు సమీపంలోని ఆస్పత్రికి తరలించి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు పంపించారు. అయితే, అప్పటికే విషం ఊపిరితిత్తుల్లోకి చేరడంతో రక్తపు వాంతులు చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments