Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ ఎయిర్‌పోర్టులో హజ్ యాత్ర టెర్మినల్ : హజ్ కమిటి ఛైర్మన్ గౌసల్ ఆజామ్

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (13:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారికి మరిన్ని సౌకర్యాలను కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటి ఛైర్మన్ బద్వేల్ షెక్ గౌసల్ ఆజామ్ చెప్పారు. వచ్చే సీజనులో హజ్ యాత్రికుల కోసం సౌకర్యాల కల్పన నిమిత్తం హజ్ కమిటి ప్రత్యేక అధికారి ఎల్.అబ్దుల్ ఖాదిర్‌తో కలిసి ముంబైలోని హజ్ కమిటి భారతదేశ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. 
 
హజ్ కమిటి ఆఫ్ ఇండియా సీఈవో యాఖుబ్ శాఖాను కలిశారు. హజ్ 2023కు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లగోరే యాత్రికులను విజయ వాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే  బయలుదేరే విధంగా ఎంబారిగేషన్ పాయింట్‌ను తిరిగి ఇవ్వాలని విఙ్ఞప్తి చేశారు. యాత్రికులూ సౌదీ అరేబియాలో మక్కా, మదీనాలలో అక్కడ బసచేసే భవనాన్ని ఎంపిక చేసుకునేందుకు ఒక అధికారిని ముందుగా అక్కడకెళ్లి బస ఎర్పాట్లు చూసుకునేందుకుగానూ సౌదీ ప్రభుత్వ అనుమతి కోరాలన్నారు.
 
ఖాదిముల్ హజ్ వాలంటీర్ల ఎంపికలో హజ్ కమిటీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు కూడ అవకాశం ఇప్పించాలని హజ్ కమిటి ఆఫ్ ఇండియా సీఈవో యాఖుబ్ ఖాన్ విన్నవించారు. ఈమేరకు అయనకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. అంధ్రప్రదేశ్ హజ్ కమిటి వినతులను స్వీకరించిన అయన సానుకూలంగా స్పందించారని గౌసల్ ఆజామ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments