Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్ వైపుకు వెళుతున్న 'రోను' తుఫాను.. ఊపిరి పీల్చుకున్న ఏపీ సర్కారు

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (18:02 IST)
రోను తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాటి ఒడిషా వైపు మీదుగా బంగ్లాదేశ్‌కు కదిలిపోతోంది. దీంతో రాష్ట్రంపై రోను తుఫాను ప్రభావం లేకుండా పోయింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమాంతరంగా కదులుతున్న రోను.. తుఫాను వేగాన్ని పుంజుకుంది. వేగంగా ఒడిశా తీరవైపు కదులుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌ తీరం పరిధిలో దీని ప్రభావం తగ్గింది. ప్రస్తుతం కళింగపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో స్థిరంగా కదులుతోంది. 
 
గంటకు 17 కిలోమీటర్ల వేగంతో.. ఉత్తర ఈశాన్యం దిశగా పయనిస్తూ బంగ్లాదేశ్ వైపు వెళుతోంది. ముందస్తు అంచనాల ప్రకారం ఇవాళ ఉదయం 5.30 గంటలకు ఏపీ తీరంలోనే తీవ్ర తుఫానుగా మారుతుందని భావించారు. అయితే ఇది.. ఈ రాత్రికి ఒడిశా తీరంలో తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణశాఖ అంచనావేస్తోంది. తుఫాను ప్రభావంతో ఉత్తరకోస్తా, గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ఒడిశా తీరంవైపు వెళ్లిపోవడంతో... దక్షిణ కోస్తాకు వర్ష సూచన లేకుండా పోయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments