Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నిమ్మగడ్డ'ను ఆటాడుకుంటున్న ఏపీ సీఎస్ ... కోర్టును ఆశ్రయించే యోచనలో ఎస్ఈసీ

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (12:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఓ ఆట ఆడుకుంటున్నారు. వచ్చే ఫిబ్రవరి నెలలో ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇదే అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్లకు, ఎస్పీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీల సాహ్ని అనుమతి ఇవ్వలేదు. దీంతో బుధవారం ఒకసారి, గురువారం మరోమారు ఈ సమావేశం వాయిదాపడింది. 
 
అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ కీలక ప్రకటన చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసమే ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు నిమ్మగడ్డ ఓ లేఖ రాయగా, వారు సమావేశంలో పాల్గొనలేదు.
 
ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎస్‌ను ఇప్పటికే అనుమతి కోరినట్లు ఎస్‌ఈసీ చెప్పారు. అయినప్పటికీ, సీఎస్ నుంచి అధికారులకు అనుమతి రాకపోవడం గమనార్హం. దీంతో ఆ వీడియో కాన్ఫరెన్స్ రద్దయింది. దీంతో సీఎస్ నీలం సాహ్నికి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మరోసారి లేఖ రాశారు. కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేయాలని అందులో కోరినట్లు తెలిసింది.
 
నిజానికి ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సీఎస్ నీలం సాహ్నికి నిమ్మగడ్డ ఓ లేఖ రాశారు. అయితే, అధికారులంతా కోవిడ్ విధుల్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని బదులిస్తూ ఎస్ఈసీకి ఆమె లేఖ రాశారు. 
 
ఈ క్రమంలో ఆయన మరోసారి లేఖ రాసినా ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాలేదు. దీంతో, దీంతో చిర్రెత్తుకొచ్చిన నిమ్మగడ్డ ఏపీ ప్రభుత్వ సీఎస్ వైఖరిపై కోర్టును ఆశ్రయించాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, ఈ సమావేశంలో పాల్గొనాలని సీఎస్ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అధికారులకు అనుమతి ఇవ్వకపోవడాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని ఎస్ఈసీ భావిస్తున్నట్లు తెలిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments