Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టెడు దుఃఖంలోనూ... మరో ప్రాణం పోకూడదనీ...

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (09:57 IST)
తమ కుటుంబానికి జరిగిన తీరని శోకం.. మరో కుటుంబానికి జరగకూడదని పుట్టెడు దుఃఖంలోనూ ఓ మృతుని కుటుంబం రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చింది. ఈ ఘటన ఏపీలోని విశాఖపట్టణం జిల్లాలో జరిగింది. ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే,
 
విశాఖకు చెందిన రవ్వా సుబ్బారావు అనే వ్యక్తి ఈ నెల 4వ తేదీన ద్విచక్రవాహనంపై విశాఖ డీఆర్ఎం కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్‌కు వెళుతూ రహదారి మధ్యలో ఉన్న గంతలో బైకు ముందు చక్రం పడటంతో బండి అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాు. ఈ ప్రమాదం మరిచిపోకముందే అదే గుంతలో పడటం వల్ల మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న సుబ్బారావు అల్లుడు వెంకటరావు చలించిపోయారు. అయినవారు దూరమైన బాధలో ఉన్నప్పటికీ సగటు మనిషిగా మానవత్వంతో స్పందించారు. 
 
ఇలాంటి కష్టం మరెవ్వరికీ రాకూడదని పేర్కొంటూ సొంత డబ్బులతో సిమెంట్, ఇసుక కొనుగోలు చేసి స్వయంగా గుంతను పూడ్చిపెట్టారు. ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనిని ప్రజలే స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి గోతులు పూడ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments