Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఎస్ఐ ప్రిలిమినరీ ఫలితాలు వెల్లడి... ఎలా చెక్ చేసుకోవాలి?

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (15:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను తాజాగా వెల్లడించారు. ఈ పరీక్షలను ఈ నెల 19వ తేదీన నిర్వహించగా కేవలం పది రోజుల్లోనే ఫలితాలను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించడం గమనార్హం. 
 
మొత్తం 411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 19వ తేదీన రాత పరీక్షను మొత్తం 291 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు హాజరుకాగా, 57,923 మంది ఎంపికయ్యారు. వీరిలో పురుషులు 49,386 మంది ఉండగా, 8,537 మంది స్త్రీలు ఉన్నారు. 
 
పరీక్ష నిర్వహించిన మరుసటి రోజే జవాబులకు సంబంధించిన ఆన్సర్ కీని విడుదల చేశారు. దీనిపై పేపర్-1కు దాదాపు 1,553 అభ్యంతరాలు బోర్డుకు అందాయి. వీటిని నిపుణులు పరిశీలించి, ఆన్సర్ కీలో ఎలాంటి మార్పులు చేయలేదని నిర్ధారించింది. 
 
రెండు పేపర్లో అర్హత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 4వ తేదీ ఉదయం నుంచి స్కాన్ చేసిన ఓఎంఆర్ షీటును వెబ్‌సైట్లలో ఉంచుతారు. ఇక ఇతర అప్‌‍డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవాలని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments