Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ వర్శిటీ.. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (12:00 IST)
ఏపీ వర్శిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ను గురువారం యోగివేమన వర్సిటీ వీసీ సూర్యకళావతి విడుదల చేశారు. మొత్తం 16 విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న 145 కోర్సుల్లో ఈ సెట్‌ ద్వారా ప్రవేశాలు జరుపనున్నారు. 
 
ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు దాఖలుకు గడువు జూలై 20. కాగా, ఆగస్టు 17 నుంచి ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. డిగ్రీ చివరి సెమిస్టర్‌ చదువుతున్నవారు సైతం ఏపీపీజీసెట్-2022 రాసేందుకు అర్హులు. రూ.500 ఆలస్య రుసుంతో జులై 27వ తేదీ వరకు, అలాగే రూ.1000 ఆలస్య రుసుంతో జులై 29వ తేదీ వరకు దరఖాస్తులు దాఖలు చేయవచ్చు.
 
పరీక్షలు ఆగస్టు 17వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సౌకర్యార్ధం హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments