Webdunia - Bharat's app for daily news and videos

Install App

వై.ఎస్. బీసీలుగా గుర్తిస్తే, జ‌గ‌న్ కార్పొరేష‌న్ ఇచ్చాడు...

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (09:31 IST)
పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీల అమలు చేసే దిశగా సీఎం జగన్ పాలన కొనసాగిస్తున్నారు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ తెలిపారు. తాడేపల్లి లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పాల - ఏకరి కార్పొరేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది.

సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాల కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాల ఏకరిలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో బిసిలగా గుర్తించారు అని పేర్కొన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా సీఎం జగన్  పాల ఏకరికి ఓ ప్రత్యేకమైన కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు అని వ్యాఖ్యానించారు.
 
సీఎం జగన్  రాష్ట్రంలో విద్య,వైద్యంలో ఓ వినూత్న విప్లవం తీసుకువచ్చారు అని కొనియాడారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల రూపరేఖలు మార్చారు అని తెలిపారు. అమ్మ ఒడి, విద్య దీవెన, ఫీజు రీంబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా ప్రతి పేదవాడి పిల్లలు  విద్య అభ్యసించాలనేది సీఎం లక్ష్యం అని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారు అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి తో పాటు పలువురు సమావేశంలో  పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments