మంత్రి హోదాలో ఉన్న కులవృత్తిని మరచిపోని ఎమ్మెల్యే.. ఎవరు?

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (15:36 IST)
ఆయన యువ ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపాకు చెందిన నేత. ఇటీవలే అనూహ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయినప్పటికీ ఆయన తన కులవృత్తిని మరిచిపోలేదు. తాను మంత్రిని కదా అని పొంగిపోలేదు. దసరా పర్వదినం రోజున ఆటవిడుపుగా తన కులవృత్తిలో నిమగ్నమయ్యారు. భావనపాడు హార్బరులో ఆయన తన కుటుంబ సభ్యులతో సముద్ర స్నానం చేసి ఆ తర్వాత చేపలవేట సాగించారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
మత్స్యకార కుటుంబంలో పుట్టిన అప్పలరాజు చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవారు. దాంతో ఆయన తన కుటుంబసభ్యుల్లా చేపలవేటలో పాలుపంచుకోలేకపోయారు. అధికభాగం చదువుతోనే సాగింది. ఆ తర్వాత వైద్య వృత్తి, ఆపై రాజకీయాలు, ఇటీవల మత్స్యశాఖ, పశుసంవర్ధకశాఖ మంత్రి పదవితో మరింత బిజీ అయ్యారు.
 
అయితే దసరా పండుగ సందర్భంగా ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి భావనపాడు పోర్టును సందర్శించారు. అక్కడ తన సోదరుడు చిరంజీవి, చిన్ననాటి మిత్రులతో కలిసి సముద్రంలోకి వెళ్లి చేపల వేట సాగించారు. సముద్రతీరంలోనే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి భోజనాలు చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు ఎంతో ఉల్లాసంగా గడిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments