Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులు సరిగా చదవలేదు.. అందుకే ఫెయిలయ్యారు : మంత్రి రోజా

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (09:38 IST)
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఏపీ  చరిత్రలో ఎన్నడూ లేనంతగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఉత్తీర్ణులు చెందిన విద్యార్థుల కంటే ఫెయిల్ అయిన విద్యార్థుల శాతమే అధికంగా ఉంది. బాగా చదివే విద్యార్థులు సైతం ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. దీంతో ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వీటిని ఏపీ మంత్రులు తిప్పకొడుతున్నారు. విద్యార్థులు సరిగా చదవలేదని అందుకే  ఫెయిల్ అయ్యారంటూ సెలవిచ్చారు. 
 
తాజాగా ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే.రోజా కూడా ఇదే పాటపాడారు. "తెలుగుదేశం అధికారంలో ఉన్న టీచర్లే ఇపుడూ ఉన్నారు. కోవిడ్ కారణంగా సరిగా చదువుకోకపోవడం వల్లనే కొంతమంది విద్యార్థులు పదో తరగి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు" అని మంత్రి వివరణ ఇచ్చారు. 
 
పైగా, ఫెయిల్ అయిన విద్యార్థులకు సిప్లమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం ఇచ్చామని, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు పాస్ అయిన వారికి రెగ్యులర్‌గా ఇచ్చే సర్టిఫికేట్లే ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా, పదో తరగతి పరీక్షల్లో మన రాష్ట్రం కంటే చాలా తక్కువ శాతం పాస్ అయిన రాష్ట్రాలు అనేకం ఉన్నాయని ఆమె గుర్తుచేయడం కొసమెరుపు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments