Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్" సినిమాకు టిక్కెట్లు పెంచుకోవచ్చు : పేర్ని నాని

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (13:41 IST)
రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించి సినిమా టిక్కెట్ ధరలను పెంచుకునే అవకాశం ఉన్నట్టు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం మాట్లాడుతూ, భారీ బడ్జెట్ సినిమా విడుదలైన 10 రోజుల పాటు సినిమా టిక్కెట్ ధరలు పెంచుకోవచ్చని అన్నారు. సాధారణ ప్రజలకు భారం పడకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. 
 
మరోవైపు, ఆన్‌లైన్ టిక్కెట్ విధానానికి టెండర్లు ఖరారయ్యాయని చెప్పారు. ఇందులో రెండు కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. వీటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. 
 
కాగా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రాన్ని రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య తన సొంత బ్యానర్ డీవీవీ సినిమాస్‌పై నిర్మించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments