Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ దొంగ పాదయాత్రలు..

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (19:03 IST)
టీడీపీ నేతలు రైతుల్ని మోసం చేసి వారి పేరుతోనే రియల్ ఎస్టేట్ యాత్ర చేస్తున్నారని ఏపీ రవాణ, సమాచార శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఫైర్ అయ్యారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలే దొంగ పాదయాత్రలు చేస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యాత్రకు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 
 
ఈ సందర్భంగా ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాదయాత్రలో వాస్తవమైన రైతులెవరూ లేరని.. ఉన్నవారంతా టీడీపీ నేతలేనని ఆరోపించారు.
 
‘కోర్టు, న్యాయమూర్తుల కళ్లు కప్పి నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్రకి నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే మొత్తం చంద్రబాబే. ఈ యాత్రకి చందాల పేరుతో చంద్రబాబు అండ్‌కో తమ నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  
 
పేదవారికి అమరావతిలో ఇళ్లు ఇస్తామని చెబితే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందనేవాళ్లు రైతులు ఎలా అవుతారని మంత్రి సూటిగా ప్రశ్నించారు. నిజమైన ఏ రైతన్న ఈ రకంగా ఆలోచించడని అన్నారు. టీడీపీ చేసిన పాపాలకు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుని ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments