Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‍‌కు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి

ఠాగూర్
ఆదివారం, 22 జూన్ 2025 (13:26 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరిందని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. జగన్ పబ్లిసిటీ పిచ్చి కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ ఆయనలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జగన్ పొదిలి పర్యటన సందర్భంగా సింగయ్య అనే వృద్దుడు జగన్ కారు కింద పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 
 
దీనిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. పబ్లిసిటీ స్టంట్‌ కోసం ప్రజల ప్రాణాలను జగన్‌ గాల్లో కలుపుతున్నారన్నారు. ఆదరణ ఉందని చూపించుకోవడం కోసం ప్రజల ప్రాణాలను తీస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ మాదిరి ఎవరూ ప్రచారం కోరుకోరు అని దుయ్యబట్టారు. 
 
'బలం ఉందని చూపించుకోవడం కోసం ప్రజల ప్రాణాలు కూడా లెక్కచేయరా? బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్లారు. అక్కడికి వెళ్లి మరో ఇద్దరి ప్రాణాలను జగన్‌ తీశారు. కారు ఢీకొనగానే సింగయ్యను ఆసుపత్రికి తరలించి ఉంటే బతికేవారు. జగన్‌ కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడితే.. పక్కకు ఈడ్చేసి వెళ్లిపోయారు. ప్రమాదంలో వృద్ధుడు చనిపోయినా ఆయన కనీసం పశ్చాత్తాప పడలేదు'’ అని గొట్టిపాటి రవికుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments