ఒరేయ్.. ఆటోలు తీయకండి.. స్టార్ట్ చేయకండి.. మంత్రి ధర్మాన కేకలు

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (13:12 IST)
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పీఎస్ఎన్ఎంహెచ్ పాఠశాలలో శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులో సోమవారం జగనన్న ఆసరా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో మంత్రి ధర్మాన ప్రసాద రావు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 
 
అయితే, ఆయన ప్రసంగించే సమయంలో అనేక మంది డ్వాక్రా మహిళలు, లబ్ధిదారులు సమావేశ మందిరం నుంచి గుంపులు గుంపులుగా వెళ్లిపోతున్న దృశ్యాలను మంత్రి చూశారు. దీంతో ఆయనకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 'ఐదు నిమిషాల్లో సమావేశం ముగియనుంది. ఏయ్‌ తల్లీ వెళ్లిపోదురు ఆగండి. 
 
ఒరేయ్‌.. ఆటోలు తీయకండి. స్టార్ట్‌ చేయకండి.. ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది' అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ కార్యక్రమాలకు హాజరైన మహిళలు  మాత్రం మంత్రి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా మధ్యలోనే వెనుదిరిగిపోయారు. వీరిని నిలువరించేందుకు అధికారులు, వలంటీర్లు విశ్వప్రయత్నాలు చేశారు. 
 
సమావేశం జరిగే పాఠశాల గేటుకు తాళం వేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన వారు ఎత్తయిన గోడ ఎక్కి బయటకు దూకి వెళ్లిపోయారు. పోతూపోతూ అధికారులకు శాపనార్థాలు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments