Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమరిపోతు వ్యవసాయం ఏదైనావుందంటే అది వరిసాగే : మంత్రి రంగనాథ రాజు

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (09:06 IST)
ప్రస్తుతం సోమరిపోతు వ్యవసాయం ఏదైనా ఉందంటే.. అది ఒక్క వ్యవసాయం మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి శ్రీరంగనాథ రాజు వ్యాఖ్యానించారు. తాను వేరే జిల్లాలకు వెళ్లినప్పుడు రైతులకు ఇదే విషయం చెబుతుంటానని సెలవిచ్చారు. 
 
శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జరిగిన కృషి విజ్ఞానకేంద్రం రజతోత్సవంలో మంత్రి రంగనాథరాజు మాట్లాడారు. 'సోమరి పోతు వ్యవసాయం ఏదైనా ఉందంటే అది వరి సాగే. రైతులు కష్టపడాల్సిన అవసరం లేదు. ఏఈగారు కాల్వలకు నీరు వదిలితే పొలంలోకి నీళ్లు వస్తున్నాయి. ఒరేయ్‌ బాబూ ఆకుమడి దున్ను... అంటే వచ్చి దున్నుతాడు బస్తా విత్తనాలు పొలంలో పడేస్తే... ఇంతని డబ్బులు ఇస్తే విత్తనాలు, ఎరువులు చల్లుతున్నారు. ఊడ్పులకూ అంతే! బస్తాకు ఇంత అని ఇస్తే సరిపోతుంది' అని వ్యాఖ్యానించారు. 
 
మంత్రి మాటలతో కిసాన్‌మేళాకు హాజరైన రైతులంతా ఒక్కసారిగా విస్తుపోయారు. ఇక్కడ విచిత్రమేమింటే శ్రీరంగనాథ రాజు గతంలో రైస్‌ మిల్లుల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కూడా పని చేయడం గమనార్హం. ఇదేసమయంలో వరిసాగులో ఉన్న కష్టాలను కూడా మంత్రి వివరించారు. 90 శాతానికి మందిపైగా కౌలు రైతులే ఉన్నారని, ఇబ్బంది వస్తే వారే నష్టపోతున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments