Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిపై బొత్స మెలిక... కమిటీ నిర్ణయమే ఫైనల్

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (16:12 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరో మెలికపెట్టారు. రాజధానిపై స్పష్టత కోసం ఓ కమిటీ వేశామనీ, ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. 
 
కాగా, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో భాగంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స సమాధానమిస్తూ, రాజధాని అమరావతిని మార్చే ఉద్దేశ్యం లేదన్నారు. పైగా, రాజధాని అక్కడే ఉంటుందన్నారు. దీంతో వైకాపా ప్రభుత్వానికి రాజధానిని మార్చే ఉద్దేశ్యం లేదన్న అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్తిబాబు శనివారం మాట్లాడుతూ, అమరావతిలో నిర్మాణ దశలో ఉన్న భవనాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని తెలిపారు. అందువల్ల ఆ నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. 
 
అదేసమయంలో శుక్రవారం నాడు సభలోని నెలకొన్న పరిస్థితిని బట్టే అమరావతే రాజధాని అని చెప్పానని బొత్స తాజాగా చెపుతూ ఓ మెలిక పెట్టారు. రాజధానిపై స్పష్టత కోసం కమిటీ వేశామని... కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందన్నారు.
 
ఆ తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులను పూర్తిగా ఆదుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని బొత్స ఆరోపించారు. 
 
అసెంబ్లీ సమావేశాలు సజావుగా కొనసాగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్టుపై మళ్లీ టెండరింగ్ కు వెళ్లే అంశంపై ఆలోచిస్తున్నామని చెప్పారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును రెండు ఫేజ్‌లుగా చేయాలని నిర్ణయించామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments