Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీనామా చేస్తానంటున్న మంత్రి బాలినేని.. షాక్‌కు గురైన సీఎం జగన్!!

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (19:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ వార్త విన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఒకింత షాక్‌కు గురయ్యారు. అయితే, ఆయన రాజీనామా చేస్తానని చెప్పడానికి గల కారణాలు లేకపోలేదు. అసలు మంత్రి బాలినేని ఎందుకు రాజీనామా చేస్తానని చెప్పారో తెలుసుకుందాం.
 
ఏపీలో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌పై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో వైఎస్.. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు విమర్శించారన్నారు. ఆ తర్వాత చంద్రబాబే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారని గుర్తుచేశారు. 
 
అలాగే, తమ ప్రభుత్వం కూడా రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి కట్టుబడి ఉందన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచారని ధర్నాలు చేస్తే కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారని గుర్తుచేశారు. 
 
వ్యవసాయ మోటర్లకు స్మార్టు మీటర్లు పెట్టాలని కేంద్ర ఆదేశించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ఒకవేళ విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగా అభిమానులకు ఫీస్ట్ లా చిరంజీవి విశ్వంభర తాజా అప్ డేట్

మ్యూజికల్ డ్రామాలో అనిరుధ్ మ్యాజిక్ చిత్రం నుంచి గీతం విడుదల

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments