రాజీనామా చేస్తానంటున్న మంత్రి బాలినేని.. షాక్‌కు గురైన సీఎం జగన్!!

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (19:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ వార్త విన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఒకింత షాక్‌కు గురయ్యారు. అయితే, ఆయన రాజీనామా చేస్తానని చెప్పడానికి గల కారణాలు లేకపోలేదు. అసలు మంత్రి బాలినేని ఎందుకు రాజీనామా చేస్తానని చెప్పారో తెలుసుకుందాం.
 
ఏపీలో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌పై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో వైఎస్.. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు విమర్శించారన్నారు. ఆ తర్వాత చంద్రబాబే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారని గుర్తుచేశారు. 
 
అలాగే, తమ ప్రభుత్వం కూడా రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి కట్టుబడి ఉందన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచారని ధర్నాలు చేస్తే కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారని గుర్తుచేశారు. 
 
వ్యవసాయ మోటర్లకు స్మార్టు మీటర్లు పెట్టాలని కేంద్ర ఆదేశించిందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ఒకవేళ విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments