Webdunia - Bharat's app for daily news and videos

Install App

లారీ కిస్తీలు క‌ట్ట‌లేక‌పోతున్నాం... హరితపన్ను నిలిపివేయండి..

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (15:10 IST)
సీఎం జగన్​కు లారీ యజమానుల సంఘం లేఖ రాసింది. కొవిడ్ ఇబ్బందుల దృష్ట్యా హరిత పన్నుపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో ఫైనాన్స్ కిస్తీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గుంతలమయమైన రోడ్లను అభివృద్ధి చేయాలని కోరారు. కొవిడ్​తో తాము తీవ్ర కష్టాలు పడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి పెంచిన హరిత పన్ను వసూలును వెంటనే నిలిపివేయాలని లారీ యజమానులు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు లారీ ఒనర్స్ అసోషియేషన్ లేఖ రాసింది. 
 
 
కొవిడ్ కారణంగా రాష్ట్రంలో రవాణా రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని లారీ యజమానులు.. సీఎం దృష్టికి తెచ్చారు. తీవ్ర మందగమనం ఉన్నందున రోజు వారి ఖర్చులను నిర్వహించడమూ కష్టమవుతోందని తెలిపారు. ఫైనాన్స్ కిస్తీలు కట్టలేకపోవడంతో వేల లారీలను ఫైనాన్స్ వారు స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం హరిత పన్ను పెంచిందని పేర్కొన్నారు. వాహనాలను బట్టి 200 రూపాయల నుంచి 20 వేలకు పన్నులు వసూలు చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. హరిత పన్ను పెంపు వల్ల లారీ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే హరిత పన్ను వసూలును నిలుపుదల చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments