Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాసన మండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (13:48 IST)
నా అక్క ఆ సీట్లో కూర్చోవ‌డం నాకు చాలా సంతోషంగా ఉంద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంబ‌ర‌ప‌డిపోయారు. శాసన మండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా ఎమ్మెల్సీ జకియా ఖానమ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా జకియా ఖానమ్‌ను సీఎం వైయస్‌.జగన్ అభినందించారు. 
 
 
ఈ రోజు అధ్యక్షా అని సంభోదించే స్ధానంలో నా అక్క జకియా ఖానమ్‌ అమ్మ కూర్చోవడం చాలా సంతోషంగా ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక గృహిణిగా చట్ట సభల్లో అడుగుపెట్టడమే కాకుండా, డిప్యూటీ  చైర్మన్‌గా ఈ రోజు ఆ స్ధానంలో కూర్చున్న ఆమె అంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం అన్నారు. నిజంగా మైనార్టీ అక్క చెల్లెమ్మలందరికీ ఇది ఒక సంకేతం, ఒక సందేశం. మహిళలు అన్ని రకాలుగా పైకి రావాలి, ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలి, ప్రభుత్వమన్నది తోడుగా ఉండాలి అన్న మన ప్రయత్నం ఈ రెండున్నర సంత్సరాలుగా జరుగుతోంద‌ని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. 
 
 
అందులో భాగంగా దేవుడు ఈ రోజు నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు సంతోషిస్తున్నాన‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. మీకు మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అని సీఎం వైయస్‌.జగన్‌ డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అమ్మాయిలు షీ సేఫ్ యాప్ తో సేఫ్ గా ఉండాలి : కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments