Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్..

ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్..
, శుక్రవారం, 26 నవంబరు 2021 (12:09 IST)
ఏపీకి మరో ముప్పు పొంచి వుంది. మూడు రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక-దక్షిణ తమిళనాడు తీరానికి చేరే అవకాశముందని తెలిపింది.
 
అల్పపీడన ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలపై పడే అవకాశం ఉందని వివరించింది. అలాగే, కోస్తాలోనూ పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 
 
ఇప్పటికే చెరువులు పూర్తిగా నిండిపోయివున్నాయి కాబట్టి.. వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని అధికారులు భయపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే ఏపీలోని పలు జిల్లాలు వరద భీభత్సానికి గురికాక తప్పదు. వాయుగుండం తుఫాన్ గా మారే విషయంపై మరో 48 గంటల్లో పూర్తి స్థాయిలో ఓ అంచనా ఏర్పడనుంది.
 
అలాగే 29న నాటికి దక్షిణ అండమాన్ వద్ద బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని అమరావతి కేంద్రం పేర్కొంది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య  దిశగా ప్రయాణించవచ్చునని అంచనా వేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరులో భూకంపం: వామ్మో అంటూ పరుగులు తీసిన ప్రజలు