Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లో ఏపీ మరో రికార్డు

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (21:49 IST)
వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో ఆంధ్రప్రదేశ్‌ మరో రికార్డు సొంతం చేసుకుంది. వ్యాక్సినేషన్‌లో మూడు కోట్ల డోసుల మైలురాయిని తాజాగా అధిగమించి రికార్డు సృష్టించింది. ఆరుకోట్ల జనాభాలో సగం మందికి పైగా వ్యాక్సినేషన్‌ వేసిన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది.

కాగా, కేంద్రం నుంచి మరిన్ని డోసులు వస్తే రాబోయే రెండు నెలల్లోనే మొత్తం వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థల సహకారంతో ఏపీలో శరవేగంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.

నేటి స్పెషల్‌ డ్రైవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 8.50 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇ‍ప్పటివరకు మొత్తంగా 3,00,87,377 మందికి వ్యాక్సిన్‌ వేశారని అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు తొలిడోసును 2,16,64,834 మంది వేసుకోగా  రెండు డోసులు వేసుకున్నవారు 84,22,543 మందిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments