ఏపీ ఐసెట్‌ 2023కు దరఖాస్తుల ఆహ్వానం

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (09:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కాలేజీల్లో ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2023కు దరఖాస్తులను ఆహ్వాన ప్రక్రియ ప్రారంభమైంది. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించే ఈ పరీక్షకు మార్చి 20వ తేదీ సోమవారం నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలిపింది. 
 
దరఖాస్తు రుసుంను రూ.650గా చెల్లించాల్సి ఉంటుంది. బీసీ విద్యార్థులు అయితే రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చొప్పున చెల్లించాలని పేర్కొంది. మే 24, 25 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం అడ్మిట్‌ కార్డులను మే 20 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఈ పరీక్షను ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, అలాగే, మధ్యాహ్నం 3 గంటల నుంచి నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు షిఫ్టులలో నిర్వహించనున్నట్టు ఐసెట్‌ కన్వీనర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటిని ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఆర్థిక కష్టాలు..

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments