Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సేవలో మరో ఐఏఎస్ అధికారి... తిరుపతి టిక్కెట్‌పై కన్ను

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (15:46 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలో మరో ఐఏఎస్ అధికారి తరిస్తున్నారు. తిరుపతి లోక్‌సభ స్థానం టిక్కెట్‌పై కన్నేసిన ఆయన సీఎం జగన్ సేవలో తరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన రాజకీయ ప్రస్థానానికి అనువుగా ఉండేలా... టీటీడీ బోర్డులో ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా కొనసాగేలా, దేవదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి దక్కించుకున్నారని సమాచారం. విశేషమేమిటంటే... కరికాల వలవన్‌కు పది రోజుల కిందటే ఈ పోస్టింగ్ వచ్చింది. ఆగస్టు నెలాఖరుతో ఆయన రిటైర్ అవుతున్నారు. కానీ... అసాధారణ రీతిలో జగన్ సర్కారు ఆయన్ను ఏడాదిపాటు అదే పోస్టులో కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 
 
అంటే... ఆయన ఎంచక్కా ఎక్స్‌అఫిషియో మెంబర్ హోదాలో టీటీడీలో కొనసాగుతూ, తిరుపతిలో తన రాజకీయ అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు! కరికాల వలవన్ తమిళనాడుకు చెందిన అధికారి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉన్న తిరుపతి లోక్‌సభ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జగన్ తరపున ప్రచారం చేసేందుకు వీలుగా రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ జనంలోకి వెళ్తున్నారు. ఆయన కూడా వైసీపీ తరపున బరిలో దిగాలని గట్టిగా ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments