మెగా డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పిన విద్యామంత్రి నారా లోకేశ్

వరుణ్
బుధవారం, 3 జులై 2024 (12:16 IST)
ఏపీలో గత ప్రభుత్వంలో డీఎస్సీ పరీక్ష కోసం దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు ప్రస్తుత విద్యా మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. కొత్త ప్రభుత్వం జారీ చేసే మెగా డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గత ప్రభుత్వంలో డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించిన ఫీజును మినహాయిస్తున్నట్టు ప్రకటించారు. టెట్, మెగా డీఎస్సీ నిర్వహణ అంశాపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 
 
టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించాలని అధికారులకు సూచించినట్టు నారా లోకేశ్ వెల్లడించారు. ఇక టెట్ సిలబస్ మార్పు అంటూ జరుగుతున్నది తప్పుడు ప్రచారం అని స్పష్టం చేశారు. సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయడంలేదని తెలిపారు. టెట్ సిలబస్ వివరాలకు https://aptet.apcfss.in వెబ్ పోర్టల్‌ను సందర్శించాలని లోకేశ్ సూచించారు.
 
'మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు ఎదురైన న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాం. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించాను' అని లోకేశ్ వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Mammootty: 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన మమ్ముట్టి భ్రమయుగం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments