Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చటి కోనసీమలో చిచ్చుకు కారణం ఆ రెండు పార్టీలే : మంత్రి వనిత

Webdunia
బుధవారం, 25 మే 2022 (07:25 IST)
పచ్చటి కోనసీమలో చిచ్చు రాజుకోవడానికి మూల కారణం తెలుగుదేశం, జనసేన పార్టీలేనని ఏపీ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత ఆరోపించారు. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చారు. దీన్ని ఆ జిల్లా వాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
అయితే, ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ప్రజలు తిరుగుబాటు చేశారు. ఫలితంగా జిల్లా కేంద్రమైన అమలాపురం అగ్నికి ఆహుతైంది. అధికార పార్టీకి చెందిన మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్ళకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పలు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. 
 
దీనిపై హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కోనసీమ అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయని ఆరోపించారు. హింసాత్మక ఘటనల్లో 20 మంది పోలీసులకు గాయాలయ్యాయనని వెల్లడించారు. జిల్లాకు అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం సబబు కాదన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరిట నామకరణం చేసినందుకు గర్వించాలని ఆమె అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments