Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొన్ని అత్యాచారాలు అలా జరిగిపోతుంటాయ్.. ఏం చేయలేం .. మంత్రి తానేటి

Webdunia
బుధవారం, 4 మే 2022 (09:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలికాలంలో వరుసగా అత్యాచారాలు జరిగిపోతున్నాయి. అయినప్పటికి మంత్రులకు, పోలీసులకు చీమకుట్టినట్టుగా కూడా లేదు. పైగా, ఈ అత్యాచార ఘటనలపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమై చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కొన్ని అత్యాచార ఘటనలు అలా జరిగిపోతుంటాయి.. వాటిని మనం ఏమీ చేయలేము అని అన్నారు. 
 
గుంటూరులో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె రేపెల్లె అత్యాచార ఘటనపై స్పందించారు. రేపల్లె రైల్వే స్టేషన్‌లో ఉన్న మహిళను అత్యాచారం చేసేందుకు దుండగులు రాలేదన్నారు. కానీ, మద్యం మత్తులో ఉన్న వారు డబ్బు కోసం బాధితురాలి వద్దకు వచ్చి ఆమె భర్తపై దాడి చేశారని చెప్పారు. పైగా, భర్త తనను రక్షించుకునేందుకు వెళ్లినపుడు నిందితులు ఆమెను నెట్టేసే విధానం, బంధించే విధానంలోనే అత్యాచారానికు గురైనట్టు ప్రత్యక్షంగా చూసినట్టు మంత్రివర్యులు వివరించారు. 
 
పైగా, పేదరికం వల్లో, మానసిక పరిస్థితుల వల్లో అప్పటికప్పుడు అనుకోని రీతిలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని అన్నారు. ఆమెపై అత్యాచారానికి, పోలీసు సిబ్బంది కొరతకు సంబంధమే లేదన్నారు. కాగా, అత్యాచార ఘటనలపై మంత్రి వరుసగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శల జడివాన కురుస్తోంది. గతంలో కూడా తల్లిదండ్రులు సక్రమంగా లేకపోవడం వల్లే పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments