Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ భవనాలకు వైకాపా రంగులు : తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు

Webdunia
బుధవారం, 20 మే 2020 (17:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పంచాయతీ భవనాలకు అధికార వైకాపా జెండా గుర్తులు వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసింది. దీంతో తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. 
 
ఈ పిటిషన్‌ని ప్రముఖ న్యాయవాది సోమయాజులు దాఖలు చేయగా, దాన్ని స్వీకరించిన కోర్టు పలు దఫాలుగా విచారణ జరిపింది. పంచాయతీ భవనాలకు ఇప్పటికీ పార్టీ రంగులను పోలినవే వేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. స్పందించిన న్యాయస్థానం.. ఆ రంగులను తొలగించమని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తుచేసింది.
 
స్పందించిన ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. వాటికి ఏ ఉద్దేశంతో ఆ రంగులు వేస్తున్నామన్న వివరాలను ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు హైకోర్టుకు తెలిపారు. గతంలో వేసిన రంగుతోపాటు అదనంగా మరో రంగును కలిపి వేస్తున్నట్టు న్యాయస్థానానికి తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments