Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగం డెయిరీ కేసు : సర్కారుకు మరోమారు మొట్టిక్కాయ

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (16:04 IST)
గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోమారు మొట్టిక్కాయ పడింది. ఈ డెయిరీని హస్తగతం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలకు చుక్కెదురైంది. సంగం డెయిరీని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోరాదంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అదేసమయంలో గతంలో సింగిల్‌ జడ్జీ ఇచ్చిన తీర్పును సమర్థించిన ధర్మాసనం ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ పిటీషన్‌ను తోసిపుచ్చింది. 
 
ఈ డెయిరీని స్వాధీనం చేసుకునే విషయంపై ఈ ఏడాది ఏప్రిల్‌ 27న ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలును నిలిపివేయాలని ఆదేశించింది. ఈ జీవో విషయంలో హైకోర్టు సింగిల్‌ జడ్జి జస్టిస్‌ సోమయాజులు ఇచ్చిన తీర్పును డివిజనల్‌ బెంచ్‌ సమర్దించింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ ధర్మాసం ముందు ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ అపీల్‌ను తిరస్కరించింది. సంగం డెయిరీ విషయంలో దాఖలైన ఇతర ఇంప్లీడ్‌ పిటిషన్లనూ తోసిపుచ్చింది.
 
సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ధర్మారావు.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెల్సిందే. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. పై విధంగా ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments