Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట .. ఈ నెల 22 వరకు అరెస్టు చేయొద్దు : హైకోర్టు

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (13:36 IST)
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి మరోమారు ఊరట లభించింది. ఈ నల 22వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు మంగళవారం సీఐడీని ఆదేశించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు... తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
మరోవైపు, ఈ కేసు వాదనలు సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని, ఆ గడువు ముగిసేవరకు ఆయనను అరెస్టు చేయబోమని స్పష్టంచేశారు. మధ్యంతర బెయిల్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోబమని కోర్టుకు తెలిపారు. ఆయన స్టేట్మెంట్‌ను రికార్డు చేసిన హైకోర్టు.. అరెస్టు చేయొద్దని ఆదేశిస్తూ తదుపరి విచాణనను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోక్షజ్ఞ తొలి సినిమాకు రూ.100 కోట్ల బడ్జెట్ అవసరమా?

రూ.200 క్లబ్ లో చేరిన త్రిష.. లియో.. గోట్ ఆమె దశ తిరిగిపోయిందిగా..

నచ్చితే బలగం సినిమాలో ప్రోత్సహించండి. నచ్చకపోతే... : దిల్ రాజు

ఆ దర్శకుడు మా కుటుంబ సభ్యుడిగా మారారు : జూనియర్ ఎన్టీఆర్

మలయాళ విలన్ నటుడు మోహన్ రాజ్ ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments