ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట .. ఈ నెల 22 వరకు అరెస్టు చేయొద్దు : హైకోర్టు

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (13:36 IST)
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి మరోమారు ఊరట లభించింది. ఈ నల 22వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు మంగళవారం సీఐడీని ఆదేశించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు... తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
మరోవైపు, ఈ కేసు వాదనలు సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని, ఆ గడువు ముగిసేవరకు ఆయనను అరెస్టు చేయబోమని స్పష్టంచేశారు. మధ్యంతర బెయిల్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోబమని కోర్టుకు తెలిపారు. ఆయన స్టేట్మెంట్‌ను రికార్డు చేసిన హైకోర్టు.. అరెస్టు చేయొద్దని ఆదేశిస్తూ తదుపరి విచాణనను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments