Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి జెత్వానీ కేసులోని ఆధారాలు భద్రపరచండి : పోలీసులకు హైకోర్టు ఆదేశం

ఠాగూర్
గురువారం, 5 సెప్టెంబరు 2024 (17:23 IST)
ముంబై నటి కాదంబరి జెత్వానీ చేసిన లైంగిక వేధింపుల కోసం ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాధారాలను తదుపరి విచారణ వరకు భద్రపరచాలని ఇబ్రహీంపట్నం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అలాగే, ఈ కేసు తదుపరి విచారణనను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. 
 
తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాదంబరీపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటివరకు సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను నిందితురాలికి తిరిగి ఇవ్వకుండా భద్రపరిచేలా ఆదేశించాలని కోరుతూ కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ కేసుపై మీడియాలో డిబెట్లు జరపకుండా నిలువరించాలని కోరారు. ఇబ్రహీంపట్నం ఠాణాలో నమోదు చేసిన కేసుకు సమాంతరంగా ఇదే వ్యవహారంపై మరో అధికారితో దర్యాప్తు చేయకుండా అడ్డుకోవాలన్నారు.
 
ఈ కేసులో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆధారాలను భద్రపరిచేలా ఆదేశించాలని కోరారు. పోలీసుల తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ వ్యాజ్యంలో వినతి అస్పష్టంగా ఉందన్నారు. ఈ వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందని, వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు. అధికారులందరూ ప్రస్తుతం వరద సహాయ చర్యల్లో ఉన్నారన్నారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. విచారణను ఈ నెల 11కు వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం