నటి జెత్వానీ కేసులోని ఆధారాలు భద్రపరచండి : పోలీసులకు హైకోర్టు ఆదేశం

ఠాగూర్
గురువారం, 5 సెప్టెంబరు 2024 (17:23 IST)
ముంబై నటి కాదంబరి జెత్వానీ చేసిన లైంగిక వేధింపుల కోసం ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాధారాలను తదుపరి విచారణ వరకు భద్రపరచాలని ఇబ్రహీంపట్నం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అలాగే, ఈ కేసు తదుపరి విచారణనను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. 
 
తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాదంబరీపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటివరకు సీజ్ చేసిన మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను నిందితురాలికి తిరిగి ఇవ్వకుండా భద్రపరిచేలా ఆదేశించాలని కోరుతూ కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ కేసుపై మీడియాలో డిబెట్లు జరపకుండా నిలువరించాలని కోరారు. ఇబ్రహీంపట్నం ఠాణాలో నమోదు చేసిన కేసుకు సమాంతరంగా ఇదే వ్యవహారంపై మరో అధికారితో దర్యాప్తు చేయకుండా అడ్డుకోవాలన్నారు.
 
ఈ కేసులో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆధారాలను భద్రపరిచేలా ఆదేశించాలని కోరారు. పోలీసుల తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ వ్యాజ్యంలో వినతి అస్పష్టంగా ఉందన్నారు. ఈ వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందని, వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు. అధికారులందరూ ప్రస్తుతం వరద సహాయ చర్యల్లో ఉన్నారన్నారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. విచారణను ఈ నెల 11కు వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం