Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ అసెంబ్లీలో విపక్ష నేతగా గుర్తింపు ఇవ్వాలి - హైకోర్టుకు జగన్

ys jagan

సెల్వి

, మంగళవారం, 23 జులై 2024 (18:29 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తనకు గుర్తింపు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సంఖ్యాబలం ఆధారంగా హోదా కల్పించాలని మంగళవారం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ప్రతిపక్షంలో అత్యధిక సభ్యులున్న పార్టీ నాయకుడే ఈ హోదాకు అర్హుడని పార్లమెంటరీ సంప్రదాయాలు నిర్దేశిస్తున్నాయని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సరైన పార్లమెంటరీ విధానాలు పాటించడం లేదని జగన్ తన పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా తనకు హోదా ఇవ్వాలని కోరుతూ గతంలో లేఖ ఇచ్చానని, దానిని ఇంకా అంగీకరించలేదని జగన్ ఆ పిటిషన్‌లో గుర్తు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసు : పోలీసుల అదుపులో పెద్దిరెడ్డి అనుచరుడు!!