Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (17:02 IST)
టీడీపీ సీనియర్ నేత, నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ పి.నారాయణకు ఏపీ హైకోర్టు ఊరట కల్పించింది. అసైన్డ్ భూముల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రాజధాని అమరావతి పరిధిలోని అసైన్డ్ భూముల కుంభకోణంలో నారాయణ పేరను ప్రధాన నిందితుడిగా చేర్చారు. 
 
పైగా, ఈ కేసులో ఇప్పటికే ఏపీ సీఐడీ పోలీసులు పలువురుని అరెస్టు చేశారు. దీంతో తనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన నారాయణ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఆయనకు బుధవారం మూడు నెలల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ విదేశాల్లో చికిత్స తీసుకోవాల్సి ఉందని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇదే అంశం ఆధారంగా ఇది వరకే ఆయన ఓ కేసులో ముందస్తు బెయిల్ పొందారు. 
 
అయితే, అసైన్డ్ భూముల కేసులో నారాయణ కీలక నిందితుడిగా ఉన్నందున ఆయనకు బెయిల్ మంజూరు చేయరాదంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు నారాయణకు మూడు నెలల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments