Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (17:02 IST)
టీడీపీ సీనియర్ నేత, నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ పి.నారాయణకు ఏపీ హైకోర్టు ఊరట కల్పించింది. అసైన్డ్ భూముల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రాజధాని అమరావతి పరిధిలోని అసైన్డ్ భూముల కుంభకోణంలో నారాయణ పేరను ప్రధాన నిందితుడిగా చేర్చారు. 
 
పైగా, ఈ కేసులో ఇప్పటికే ఏపీ సీఐడీ పోలీసులు పలువురుని అరెస్టు చేశారు. దీంతో తనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన నారాయణ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఆయనకు బుధవారం మూడు నెలల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ విదేశాల్లో చికిత్స తీసుకోవాల్సి ఉందని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇదే అంశం ఆధారంగా ఇది వరకే ఆయన ఓ కేసులో ముందస్తు బెయిల్ పొందారు. 
 
అయితే, అసైన్డ్ భూముల కేసులో నారాయణ కీలక నిందితుడిగా ఉన్నందున ఆయనకు బెయిల్ మంజూరు చేయరాదంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు నారాయణకు మూడు నెలల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments