Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీటీసీ - జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పచ్చజెండా

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (12:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటీపీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించవచ్చని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జే.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. పైగా ఈ ఎన్నికలను కోర్టు ధర్మాసనం సమర్థించింది. దీంతో ఎంటీపీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. 
 
గత ఏప్రిల్ ఒకటో తేదీన రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనరు నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఏప్రిల్ 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను నిర్వహించిన విషయం తెల్సిందే. అయితే, ఈ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మే 21వ తేదీన తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగ ఓట్ల లెక్కింపునకు పచ్చజెండా ఊపుతూ గురువారం తీర్పును వెలువరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments