Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు షాక్... మూడు పిటిషన్లను డిస్మిస్ చేసిన హైకోర్టు

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (11:15 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, అంగళ్లు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్లపై సుధీర్ఘ విచారణలు జరిపిన హైకోర్టు సోమవారం కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు టీడీపీ సిద్ధమవుతుంది. 
 
ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపున హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై గత వారం సుధీర్ఘంగా విచారణలు జరిగాయి. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ఏ24గాను, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ1గాను, అంగళ్లు కేసులో ఏ1గా ఉన్నారు. అంగళ్ళు కేసులో ఇప్పటికే పలువురు టీడీపీ నేతలకు ఇదే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఈ కేసులో ఖచ్చితంగా ముందస్తు బెయిల్ లభిస్తుందని టీడీపీ శ్రేణులు భావించాయి. 
 
కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేయడం గమనార్హం. దీంతో టీడీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. మరోవైపు, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments