ఆ ఫామ్ ఇచ్చిన చోట విచారించే అధికారం ఎస్ఈసీకి లేదు : హైకోర్టు

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (15:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏపీ హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. నామినేషన్ల సందర్భంగా బలవంతపు ఉపసంహరణలు, అడ్డగింతలపై విచారణ చేపట్టాలన్న ఎస్ఈసీ ఆదేశాలను కోర్టు రద్దు చేసింది. 
 
గతంలో ఏకగ్రీవం అయినవారికి వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఏకగ్రీవాలపై దర్యాప్తు జరిపేందుకు వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది... ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి ఎవరైనా బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాల కారణంగా నామినేషన్ వేయలేకపోయారో వారు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు జరిపి.. అది నిజమని తేలితే వాళ్లను మళ్లీ అభ్యర్థిగా పరిగణిస్తామని ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 
 
ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కొంతమంది ఏకగ్రీవమైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు గతంలో తీర్పును రిజర్వు చేసింది. తాజాగా మంగళవారం దీనిపై విచారణ జరిపిన న్యాయం స్థానం.. గతంలో ఏకగ్రీవమైన వారికి వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశిస్తూ, ఏకగ్రీవాలపై దర్యాప్తు జరిపేందుకు వీల్లేదని తీర్పు వెలువరించింది. అలాగే ఎక్కడైతే ఎన్నికలు నిలిచిపోయాయో.. అక్కడ మళ్లీ ఎన్నికలు జరుపుకోవచ్చునని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani Review: మృత్యుంజయ్ నాకు చాలా నచ్చింది : నేచురల్ స్టార్ నాని రివ్యూ

Nabha, Aishwarya : అనంత పద్మనాభ స్వామి సెట్లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌ల పాట

Rajiv: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు లాంటి సిరీస్‌లో భాగమవ్వడం అదృష్టం : రాజీవ్ కనకాల

Sharva: హీరో శర్వా... బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX ఫార్మాట్‌లలో రిలీజ్

Karthik Dandu: నాగ చైతన్య కి నేనే బెస్ట్ ఫిలిం ఇస్తున్నా : కార్తీక్ దండు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments