Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వానికి మరో షాక్.. జీవో 72 కొట్టివేసిన హైకోర్టు

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (13:47 IST)
ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 72ను హైకోర్టు కొట్టేసింది. సింహాచలం వరాహలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానానికి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా సంచయిత గజపతి రాజు నియామకం చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. 
 
మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు వేసిన రిట్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.. గతంలో మాన్సాస్ ట్రస్టీ, సింహాచల దేవస్థానం చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగిస్తూ.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. ఆ స్థానంలో  సంచయితను నియమించింది. దానికి సబంధించి 72 జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.  దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అశోక్ గజపతి రాజు న్యాయ పోరాటం చేశారు.
 
అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లను విచారించిన హైకోర్టు.. సంచయిత దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. తాజా హైకోర్టు ఆదేశాలతో మాన్సాస్  ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి అశోక్ గజపతి రాజు  చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. 
 
తాజా తీర్పుపై సంచయిత గజపతి రాజు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఆమె తన వాదన నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.. అయితే తాజా తీర్పుపై ఆము ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments