Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాల వద్ద నెత్తురు కూడా తినే సన్నాసులు : : ప్రభుత్వ విప్

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (17:50 IST)
టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణపై ఏపీ ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బండారును ఓ బడుద్ధాయిగా ప్రభుత్వ విప్ అభివర్ణించారు. టీడీపీ నేతలు శవాల వద్ద నెత్తురు కూడా తినే సన్నాసులు అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. 
 
తూర్పు గోదావరి జిల్లాలో అధికార, వైకాపా నేతల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గున మండిపోయేలా వుంది. దీంతో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్రమంలో బండారు సత్యనారాయణనను ఉద్దేశించి ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ టీడీపీలో బండారు వంటి లుచ్ఛా నాయకులే ఉన్నారు. 
 
అకాల మరణం చెందిన వివాద రహితుడైన మంత్రి గౌతం రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి నీకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. బండారూ.. నిన్ను ఈ వ్యాఖ్యలు చంద్రబాబు చేయమన్నాడా? అంటూ నిలదీశారు. 
 
ఇకపోతే యనమల రామకృష్ణుడుకి తునిలో సత్తా లేకే పక్క జిల్లాలోని పత్తా లేని నాయకులను తీసుకొచ్చి మీటింగులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. యనమల ఒక ముసలోడు, ఆ ముసలోడు యువత కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 
 
సీఎం పెట్టుబడుల గురించి ఒత్తిడి తేవడం వల్లే మంత్రి గౌతం రెడ్డికి గుండెపోటుకు గురయ్యారని, దీనిపై విచారణ జరిపించాలంటూ టీడీపీ నేతల డిమాండ్ చేయడంతో వైకాపా నేతలు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments