Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ కోతలంటూ వార్తలు రాస్తే పరువు నష్టందావా వేస్తా...

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (10:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు అమలవుతున్నాయంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ మండిపడ్డారు. నిరంతరాయంగా విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. అయితే, కరెంట్ కోతలతో జనం అల్లాడిపోతున్నట్టు తప్పుడు వార్తలు వస్తున్నాయన్నారు. ఇలాంటి వార్తలు రాస్తే పరువు నష్టందావా వేస్తానని హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్‌ను అందిస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయానికి 9 గంటల పాటు కరెంట్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. అయినప్పటికీ పత్రికల్లో విద్యుత్ కోతలంటూ వార్తలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాష్ట్రంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఈ విషయాన్ని పలుమార్లు విలేకరుల సమావేశంలో చెప్పినప్పటికీ పదేపదే అలాంటి వార్తలు వస్తున్నాయన్నారు. ప్రజల్లో అపోహలు కలిగించడంతో పాటు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఇలాంటి వారిపై పరువు నష్టందావా వేస్తామని ఆయన హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

Tammareddy: మంచు విష్ణు, మనోజ్ కు మధ్యవర్తిగా తమ్మారెడ్డి భరద్వాజ

తమ్ముడుని కాపాడుకునేందుకు దిల్ రాజు నాపై నిందలు వేశారు... అత్తి

కన్నప్ప నుంచి అరియానా, వివియానా పాడిన శ్రీ కాళ హస్తి పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments