Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయణను వదిలిపెట్టని ప్రభుత్వం.. బెయిల్ రద్దు కోసం..

Webdunia
గురువారం, 12 మే 2022 (11:07 IST)
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నారాయణను ఏదో రూపంలో అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండిపట్టుతో ఉంది. అందుకే ఆయనకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలన్న భావిస్తుంది. 
 
ఏపీలో జరుగుతున్న పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధిపతిగా ఉన్న నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. అయితే, ఆయనపై సీఐడీ పోలీసులు మోపిన అభియోగాలను కోర్టు కొట్టివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలుకు వెళ్ళకుండానే నారాయణ విడుదలయ్యారు. దీన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది.

అదేసమయంలో నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై గురువారం లంచ్ మోషన్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఈ మేరకు న్యాయనిపుణులతో ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.

ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కోర్టులో నారాయణకు ఊరట లభించినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆయన్ను వదిలిపెట్టేలా లేదు. మేజిస్ట్రేట్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించగా ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments