Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయణను వదిలిపెట్టని ప్రభుత్వం.. బెయిల్ రద్దు కోసం..

Webdunia
గురువారం, 12 మే 2022 (11:07 IST)
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నారాయణను ఏదో రూపంలో అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండిపట్టుతో ఉంది. అందుకే ఆయనకు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాలన్న భావిస్తుంది. 
 
ఏపీలో జరుగుతున్న పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధిపతిగా ఉన్న నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. అయితే, ఆయనపై సీఐడీ పోలీసులు మోపిన అభియోగాలను కోర్టు కొట్టివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలుకు వెళ్ళకుండానే నారాయణ విడుదలయ్యారు. దీన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది.

అదేసమయంలో నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై గురువారం లంచ్ మోషన్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఈ మేరకు న్యాయనిపుణులతో ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.

ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కోర్టులో నారాయణకు ఊరట లభించినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆయన్ను వదిలిపెట్టేలా లేదు. మేజిస్ట్రేట్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించగా ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

Kamal: మణిరత్నం బర్త్ డే గా థగ్ లైఫ్ నుంచి విశ్వద నాయక సాంగ్ రిలీజ్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments