Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏబీ వెంకటేశ్వర రావుకు షాకిచ్చిన ఏపీ సర్కారు.. షోకాజ్ నోటీసు జారీ

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (12:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ నిఘా విభాగ అధిపతి ఏబీ వెంకటేశ్వర రావుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు షాకిచ్చింది. ఆయనకు షోకాజ్ నోటీసును పంపించింది. ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధనను పాటించ లేదని ఆ నోటీసుల్లో పేర్కొంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పెగాసెస్ సాఫ్ట్‌వేర్ అంశంతో పాటు ఆయన్ను సస్పెండ్ చేసిన అంశంపై మార్చి 21వ తేదీన వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్మీట్‌పై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మీడియాతో మాట్లాడిన అంశంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ షోకాజ్ నోటీసు జారీచేశారు. 
 
ఇందులో ప్రభుత్వ అనుమతి లేకుండా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం, ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధనను పాటించకుండా మీడియా సమావేశాన్ని నిర్వహించారని పేర్కొన్నారు. ఈ నోటీసు అందుకున్న వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో తగిన  చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments