Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏబీ వెంకటేశ్వర రావుకు షాకిచ్చిన ఏపీ సర్కారు.. షోకాజ్ నోటీసు జారీ

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (12:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ నిఘా విభాగ అధిపతి ఏబీ వెంకటేశ్వర రావుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు షాకిచ్చింది. ఆయనకు షోకాజ్ నోటీసును పంపించింది. ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధనను పాటించ లేదని ఆ నోటీసుల్లో పేర్కొంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పెగాసెస్ సాఫ్ట్‌వేర్ అంశంతో పాటు ఆయన్ను సస్పెండ్ చేసిన అంశంపై మార్చి 21వ తేదీన వెంకటేశ్వర రావు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్మీట్‌పై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మీడియాతో మాట్లాడిన అంశంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ షోకాజ్ నోటీసు జారీచేశారు. 
 
ఇందులో ప్రభుత్వ అనుమతి లేకుండా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం, ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధనను పాటించకుండా మీడియా సమావేశాన్ని నిర్వహించారని పేర్కొన్నారు. ఈ నోటీసు అందుకున్న వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో తగిన  చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments