Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా రంగు పోతోంది... ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధం

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (13:18 IST)
గత వైకాపా ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికు చెందిన వైకాపా రంగులతో కూడిన రేషన్ కార్డులను జారీచేశారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం స్థానంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వం మారి నాలుగు నెలలు కావొస్తున్నప్పటికీ వైకాపా రంగులతో ఉన్న పాత రేషన్ కార్డులపైనే సరకులను పంపిణీ చేస్తున్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత కార్డులను తొలగించి కొత్త కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం భావించింది. వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. 
 
కొత్త కార్డులకు సంబంధించి అదికారులు పలు డిజైన్లను రూపొందించి, వాటిని పరిశీలిస్తున్నారు. లేత పసుపు రంగులో ఉండే కార్డుపై రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాన్ని ముద్రించిన డిజైన్‌ను ప్రభుత్వం ఆమోదం కోసం అధికారులు పంపించారు. దీంతో పాటు మరికొన్ని డిజైన్లను కూడా ప్రభుత్వానికి పంపించారు. వీటిలో ఏదొ ఒక డిజైన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆ రంగుతో డిజైన్ చేసిన కొత్త కార్డులను పంపిణీ చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లిపీటలెక్కనున్న హీరో నారా రోహిత్ - ఆదివారం నిశ్చితార్థం

సిరి సెల్లతో నారా రోహిత్ నిశ్చితార్థం.. నిజమేనా?

నారా రోహిత్ సుందరకాండ నుంచి ఫుట్ ట్యాపింగ్ సాంగ్ రిలీజ్

మిస్టర్ సెలెబ్రిటీ విజయం ఆనందంగా ఉంది: నిర్మాత పాండు రంగారావు

నిహారిక కొణిదెల ఆవిష్కరించిన నరుడి బ్రతుకు నటన ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అక్టోబరు 11 ప్రపంచ బిర్యానీ దినోత్సవం - భారత్‌కు బిర్యానీ పరిచయం చేసింది ఎవరు?

తేనెలో ఊరబెట్టిన ఉసిరి కాయలు తింటే కలిగే ఫలితాలు ఏమిటి?

బత్తాయి పండ్లను ఎలాంటి సమస్యలు వున్నవారు తినకూడదు?

హెచ్-ఎం కొత్త పండుగ కలెక్షన్: వేడుకల స్ఫూర్తితో సందర్భోచిత దుస్తులు

ఎన్ఆర్ఐల కోసం ఏఐ-ఆధారిత రిమోట్ పేరెంట్ హెల్త్ మానిటరింగ్ సర్వీస్ డోజీ శ్రవణ్

తర్వాతి కథనం