Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా రంగు పోతోంది... ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీకి సిద్ధం

ఠాగూర్
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (13:18 IST)
గత వైకాపా ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికు చెందిన వైకాపా రంగులతో కూడిన రేషన్ కార్డులను జారీచేశారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం స్థానంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వం మారి నాలుగు నెలలు కావొస్తున్నప్పటికీ వైకాపా రంగులతో ఉన్న పాత రేషన్ కార్డులపైనే సరకులను పంపిణీ చేస్తున్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత కార్డులను తొలగించి కొత్త కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం భావించింది. వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. 
 
కొత్త కార్డులకు సంబంధించి అదికారులు పలు డిజైన్లను రూపొందించి, వాటిని పరిశీలిస్తున్నారు. లేత పసుపు రంగులో ఉండే కార్డుపై రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాన్ని ముద్రించిన డిజైన్‌ను ప్రభుత్వం ఆమోదం కోసం అధికారులు పంపించారు. దీంతో పాటు మరికొన్ని డిజైన్లను కూడా ప్రభుత్వానికి పంపించారు. వీటిలో ఏదొ ఒక డిజైన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆ రంగుతో డిజైన్ చేసిన కొత్త కార్డులను పంపిణీ చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం