కొత్త జిల్లాల ప్రకటనపై వెనక్కి తగ్గిన సర్కారు

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (12:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొత్త జిల్లాల ఆవిర్భావంపై ఉగాది రోజైన ఏప్రిల్ 2వ తేదీన ప్రకటన చేస్తామని తొలుత ప్రకటించింది. దీంతో ఉగాది రోజున సెలవును కూడా రద్దు చేసింది. ఇంతలో ఏమైందో ఏమోగానీ, ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉండగా, వాటిని లోక్‌సభ ప్రాతిపదికగా 26 జిల్లాలను ఏర్పాటు చేసింది. వాస్తవానికి 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సివుంది. కానీ, అరకు లోక్‌సభను రెండు జిల్లాలుగా చేశారు. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరింది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదముద్ర వేసింది. 
 
ఆ తర్వాత ఈ కొత్త జిల్లాల ఆవిర్భావంపై ఒక అధికారిక ప్రకటనను ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించింది. అందుకోసం భారీ వేడుకను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఉగాది రోజున కొత్త జిల్లాల ప్రకటన రానున్న నేపథ్యంలో ఏప్రిల్ 2న ఉగాది సెలవును కూడా రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. 
 
అయితే, జిల్లాల ఆవిర్భావ ప్రకటన వాయిదాపడటంతో యాధావిధిగా ఉగాది సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఏప్రిల్ 4వ తేదీ సోమవారం ఈ కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆవిర్భావ ప్రకటన చేసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments