ఆర్బీఐ అనుమతిలోని లోన్ యాప్‌ల తాట తీయండి : సీఎం జగన్

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (14:40 IST)
ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ లోన్‌యాప్‌ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఈ యాప్‍‌ల నిర్వాహకులు ఆగడాలు తట్టుకోలేని అనేక బాధితులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఏపీలో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వారి పిల్లలు అనాథలయ్యారు. ఈ విషయం సీఎం జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా కలచివేసింది. దీంతో ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఉక్కుపాదం మోపాలని ఆయన అధికారులను ఆదేశించారు. భారత రిజర్వు బ్యాంకు అనుమతి లేని లోన్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. 
 
కాగా, తాజాగా రాజమండ్రికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి అనే దంపతులు ఆన్‌లైన్ లోన్ యాప్‌ నిర్వాహకుల ఆగడాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసకున్నారు. రుణం తిరిగి చెల్లించకపోవడంతో న్యూడ్ ఫోటోలు షేర్ చేస్తామంటూ బెదిరించడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో నాలుగేళ్ల నాగసాయి, రెండేళ్ల లిఖిత శ్రీలు అనాథలుగా మిగిలారు. ఈ ఘటన సీఎం జగన్‌ను తీవ్ర ఆవేదనకు గురించారు. ఈ నేపథ్యంలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments