Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ అనుమతిలోని లోన్ యాప్‌ల తాట తీయండి : సీఎం జగన్

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (14:40 IST)
ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ లోన్‌యాప్‌ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఈ యాప్‍‌ల నిర్వాహకులు ఆగడాలు తట్టుకోలేని అనేక బాధితులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఏపీలో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వారి పిల్లలు అనాథలయ్యారు. ఈ విషయం సీఎం జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా కలచివేసింది. దీంతో ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఉక్కుపాదం మోపాలని ఆయన అధికారులను ఆదేశించారు. భారత రిజర్వు బ్యాంకు అనుమతి లేని లోన్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. 
 
కాగా, తాజాగా రాజమండ్రికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి అనే దంపతులు ఆన్‌లైన్ లోన్ యాప్‌ నిర్వాహకుల ఆగడాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసకున్నారు. రుణం తిరిగి చెల్లించకపోవడంతో న్యూడ్ ఫోటోలు షేర్ చేస్తామంటూ బెదిరించడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో నాలుగేళ్ల నాగసాయి, రెండేళ్ల లిఖిత శ్రీలు అనాథలుగా మిగిలారు. ఈ ఘటన సీఎం జగన్‌ను తీవ్ర ఆవేదనకు గురించారు. ఈ నేపథ్యంలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments