Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ ఫీజు : ప్రైవేట్ స్కూల్స్‌కు ఏపీ సర్కారు ఆర్డర్స్... తేడా వస్తే..

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (18:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ తర్వాత కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది. అంటే జూన్ రెండో వారం నుంచి పాఠశాలలు ప్రారంభంకావాల్సివుంది. అపుడు విద్యార్థుల నుంచి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఫీజు దండకాలకు పాల్పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ముందుగా గ్రహించిన ఏపీ సర్కారు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
లాక్‌డౌన్ తర్వాత ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తొలి విడత ఫీజు మాత్రమే వసూలు చేయాలని స్పష్టంచేసింది. అది కూడా, తొలి విడత ఫీజును రెండు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఏ విద్యార్థి ప్రవేశాన్ని నిరాకరించరాదంటూ ఈ మేరకు పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అదీకూడా 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి గత యేడాది అంటే 2019-20 విద్యా సంవత్సరంలో వసూలు చేసిన ఫీజునే వసూలు చేయాలని కోరింది.
 
కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఆదేశాలు జారీచేసింది. కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని స్పష్టంగా చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇపుడు ఈ కోవలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments