Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల ఖర్చు ఎంతో తెలుసా?

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (10:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల కోసం భారీగానే ఖర్చు చేస్తుంది. గత 2020-21లో ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.37,458 కోట్లను ఖర్చు చేసింది. గత యేడాది ఈ మొత్తం రూ.33102 కోట్లను వ్యయం చేసింది. 
 
అంటే, ప్రభుత్వ ఆదాయంలో ఏకంగా 36 శాతం మొత్తం ఉద్యోగుల వేతనాలకు ఖర్చు చేయడం గమనార్హం. ఈ విషయం ఓ నివేదిక బహిర్గతం చేసింది. ప్రభుత్వం మొత్తం ఖర్చులో వేతనాలు, పెన్షన్ల వాటా ఏపీలోనే అత్యధికమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇటీవల ఇచ్చిన నివేదికలోనూ పేర్కొంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే అధికంగా ఉందని నివేదిక బహిర్గతం చేసింది. 
 
మిగులు బడ్జెట్‌తో, దేశంలోని ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వేతనాల వాటా 21 శాతంగా ఉంది. కానీ, ఏపీలో మాత్రం ఇది 36 శాతంగా ఉంది. ఇపుడు కొత్త పీఆర్సీని అమలు చేయడం వల్ల ప్రభుత్వం ఖజానాపై అదనంగా మరో రూ.10 వేల కోట్ల అదనంగా పడనుంది. ఇప్పటికే జీతాలు, పెన్షన్ల రూపంలో రూ.68,430 కోట్లను ఉద్యోగుల వేతనాలకు ఖర్చు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments