Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడెవ్వడు.. వీడెవ్వడు.. సజ్జల ఎవ్వడు అంటూ ఉద్యోగస్తులు చిందులు

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (23:05 IST)
ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇజ్జత్ మొత్తాన్ని గంగలో కలిపేశారు ఉద్యోగస్తులు. పీఆర్సీపై ముఖ్యమంత్రి కాకుండా సజ్జల ఇష్టానుసారం మాట్లాడటం పెద్ద దుమారానికి కారణమైంది. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలే కానీ మా జీతాల గురించి ఇవ్వడమేంటని ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.

 
ఈ నేపథ్యంలో ఛలో విజయవాడ పేరుతో వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకున్నారు. పోలీసులు ఉదయం నుంచి హౌస్ అరెస్టులు చేసినా, నిర్భంధించినా వెనకడుగు వేయలేదు. 

 
ఉప్పెనలా ఉదయం 10 గంటల కల్లా విజయవాడకు చేరుకుని నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అయితే ఇందులో సజ్జల రామక్రిష్ణారెడ్డిని అభాసుపాలు చేసేలా ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. 

 
వాడెవ్వడు, వీడెవ్వడు.. సజ్జల ఎవ్వడు అంటూ ఉద్యోగస్తులు అష్టాచెమ్మా ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. సజ్జల తీరును దుయ్యబట్టారు. పిఆర్సీ అంశంలో సజ్జల జోక్యమేంటని ఆక్షేపించారు. అలాంటి ఇలాంటి ర్యాగింగ్ మొదలెట్ట లేదు ఉద్యోగులు, ఉపాధ్యాయులు. తమ సత్తాను చూపిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments