Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులపై వేటు.. జీవీ రెడ్డి (video)

సెల్వి
మంగళవారం, 24 డిశెంబరు 2024 (19:04 IST)
Fiber Net
ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది ఉద్యోగులను తొలగిస్తామని ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నట్లు జీవీ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. 
 
గత వైసీపీ ప్రభుత్వంలో అర్హత లేని వారిని ఫైబర్ నెట్‌ ఉద్యోగులుగా నియమించారని తెలిపారు. వైసీపీ హయాంలో తీసుకున్న ఉద్యోగుల్లో వైసీపీ నేతల సిఫార్సుతో ఎక్కువ మంది వచ్చారని.. నిబంధనలు విరుద్ధంగా ఆఫర్ లెటర్, అపాయింట్‌మెంట్ లెటర్ కూడా లేకుండా ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు. 
 
2016-19 మధ్య 108 మంది ఉద్యోగులతో ఫైబర్ నెట్ నడిచిందన్న జీవీ రెడ్డి.. అప్పట్లో ఫైబర్‌ నెట్‌కు 10 లక్షల కనెక్షన్లు ఉండేవన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా 2019-24 మధ్య ఫైబర్ నెట్ ఉద్యోగుల సంఖ్యను 1360కి పెంచారని..కనెక్షన్లు ఐదు లక్షలకు పడిపోయాయని జీవీ రెడ్డి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments